తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 22( హింస)
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ దంపతులు చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నీటి సమృద్ధి విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొమ్మిది నెలల్లోనే తాజాగా రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యే మరో అవకాశం వారికి దక్కింది. ఈనెల 26వ తేదీన గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోం వేడుకలకు రావాలంటూ నెల్లుట్ల సర్పంచ్ దంపతులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర పంచాయితీరాజ్ విభాగం నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ కు ఆదేశాలు పంపించారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
