దిల్లీ,0 5 జనవరి (హిం.స)ఈ నెల 7వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటించనుంది.
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం జనవరి 7 నుంచి రాష్ట్రాల్లో పర్యటించనుంది. తొలుత ఈసీ బృందం జనవరి 7 నుంచి 10వ తేదీ మధ్య.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. లోక్సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈసీ బృందం రాష్ట్రాల పర్యటనకు ముందు.. వీరు ఎన్నికల సంఘానికి తమ నివేదికను ఇవ్వనున్నారు
లోక్సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణంగా ప్రతిసారీ జరిగే అధికారిక ప్రక్రియనే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసులు, పాలనా విభాగ అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఈసీ సమీక్షలు నిర్వహిస్తుందిఈసీ దేశవ్యాప్త పర్యటన పూర్తయిన అనంతరం.. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
