తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 1( హింస)
ఎంజిఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజిఎం లో చేరి 2 మంది రికవరీ అయ్యారు. 7గురు చికిత్స పొందుతున్నారన్నారు. 1200 ఆక్సిజన్ బెడ్స్ , 3 ఆక్సీజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని, పవర్ కట్ అయినపుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజిఎం లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. ఎంజీఎం లో ఇంకను కావాల్సిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం నిర్వహిస్తామన్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
