ఢిల్లీ, 27 డిసెంబర్ (హిం.స)
ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటన అనంతరం ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారతదేశంలోని తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
