కర్నూలు: 25 జనవరి (హిం.స(ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. స్వామివారిని పుష్ప రథంపై ఊరేగిస్తారు. రాత్రి ఆలయంలో వరుడు మహాశివుడి తరుపున గడిగె కుటుంబానికి చెందిన వారు… వధువు పార్వతీదేవి తరుఫున బండ కుటుంబానికి చెందినవారు పెద్దలుగా వ్యవహరించి వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొంటారు.
