తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పంజా విసురుతున్న ఫైర్ బ్రాండ్
షాద్ నగర్ నియోజకవర్గం పై డీకే అరుణ ప్రత్యేక దృష్టి
డీకే అరుణ ఈ పేరు పాలమూరు జిల్లాలో తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాక తప్పదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ పేరు అందరికీ సుపరిచితమే.
జేజమ్మ అనే పేరు వింటే కూడా వెంటనే పాలమూరు ఫైర్ బ్రాండ్ డీకే అరుణ అంటూ ఠక్కున చెప్పేస్తారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో ఆమెకు కీలకమైన అసెంబ్లీ స్థానంగా షాద్ నగర్ నియోజకవర్గం ఉంది. డీకే అరుణకు ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన డీకే అరుణ ఈసారి ఎలాగైనా ఎంపీగా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నారు. ప్రత్యేక ఎన్నికల ప్రణాళికతో ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున పోటీకి దిగారు. పాలమూరు ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన డీకే అరుణను పాలమూరు ప్రజలు ముద్దుగా జేజమ్మ కూడా పిలుచుకుంటారు. రాజకీయాల్లో పాలమూరు ఫైర్ బ్రాండ్ గా భావిస్తారు.
ఈ ఎన్నికల్లో డీకే అరుణ ప్రతి నియోజకవర్గం నుండి అన్ని వర్గాల మద్దతును కూడగట్టాలలో సఫలీకృతులు అవుతున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఆమె సేవలో అందించడంతో ఆమెకు ఇప్పుడు ప్రచారంలో ఈ పని సులువుగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పరిచయాలు ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి నాయకుడిని ఆమె ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక ఒరవడిని ఆమె సృష్టించుకున్నారు. పార్టీలో పనిచేసేవారు, ఎక్కువ చరిష్మా గల వారిని ఆమె వెంటనే గుర్తించి గెలుపుకు చేయాల్సిన వ్యూహాలను అమలుపరుచుతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీని వీడి వెళ్లిపోయిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి లబ్ధి చేకూరే విధంగా పాచికలు పారించారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి మోడీని ప్రధానిని చేయాలననే సంకల్పాన్ని ముందుంచి ఆమె మొదట ఇంట గెలిచే ప్రయత్నం చేశారు. ఇంట గెలిచాక రచ్చ గెలవడం ఎంత సులువో వేరేగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం డీకే అరుణ నియోజకవర్గంలో ఇదే ఫార్ములాను వాడి గత ఎన్నికల కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో డీకే అరుణ 3,33, 573 లక్షల ఓట్లు సాధించగలిగారు. అంటే 33.88% ఓట్లు ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
గత ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డికి కేవలం 1 లక్షా 93 వేల 631 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 19.67% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. గత ఎన్నికలతో ఇప్పుడు పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగా మారాయి. గత ఎన్నికల్లో నెంబర్ వన్ స్థానం బీఆర్ఎస్ పార్టీది అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆస్థానాన్ని భర్తీ చేసుకుంది. దీంతో డీకే అరుణ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. గత ఎన్నికల్లో షాద్ నగర్ నియోజక వర్గంలో 40వేల పైచిలుకు ఓట్లను సాధించిన
డీకే అరుణ ఈసారి లక్ష ఓట్లకు పైగా టార్గెట్ ను నిర్దేశించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే డీకే అరుణ ప్రతి నియోజకవర్గంలో తన అనుచరులు అభిమానులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని కీలకమైన నాయకులను, మేధావులను ఉద్యోగస్తులను ప్రజా సంఘాలను జర్నలిస్టులను ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. డీకే అరుణ వెనుక భర్త భరత సింహారెడ్డి కూడా అంతర్గత వ్యూహాన్ని సిద్ధం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం లో ఆయా వర్గాలను ఆయన ఇప్పటికే రెండు పర్యాయాలు కలుసుకున్నారు. నేడు షాద్ నగర్ నియోజకవర్గంలో ఆమె ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
డీకే అరుణకు కలిసి వచ్చే అంశాలు.
ధర్మవరపు కొట్టం అరుణ డీకే (అరుణ) ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో (2004-2009) ఆంధ్రప్రదేశ్లో సమాచార మరియు పౌర సంబంధాల శాఖకు మరియు రోశయ్య మంత్రివర్గంలో (2009-2010) చిన్న తరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమలకు మంత్రిగా పనిచేశారు. ఆమె 2004-2014 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరియు 2014 మరియు 2018 మధ్య తెలంగాణ శాసనసభకు ఎమ్మెల్యేగా గద్వాల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఆమె రాజకీయాల్లో రాజీలేని పోరాట యోధురాలుగా పేరు ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఆమె అన్ని వర్గాలకు సేవలు అందిస్తారని విశ్వాసం ప్రజల్లో గట్టిగా ఉంది. డీకే అరుణ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆమె అనుకున్న లక్ష్యం కోసం ఎక్కడికైనా వెళ్లే దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ లేడీగా కూడా పేరు గడించారు. అరుణ 2004 ఎన్నికలలో భిన్నంగా సమాజ్వాదీ పార్టీలో చేరి ఎమ్మేల్యేగా గెలిచారు. ఆమె 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు మరియు సెప్టెంబర్ 2020లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులై ఆమె కమిట్మెంట్ ఎలాంటిదో నిరూపించారు. అదృష్టవశాత్తు డీకే అరుణ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు రాజకీయ కుటుంబాలు కావడం ఆమెకు ఎనలేని రాజకీయ తెలివితేటలను ప్రసాదించిందని చెప్పవచ్చు.
ఆమె కుటుంబంలో డీకే సత్యారెడ్డి, ఆమె భర్త డీకే భరత సింహారెడ్డి, డీకే సమరసింహారెడ్డిలు రాజకీయాల్లో ప్రత్యేక రుద్ర ఉంది. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి , సోదరులు వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకులు. ఆమె తండ్రి, సోదరుడు వెంకటేశ్వర్ రెడ్డి 2005లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నారాయణపేటలో వేడుకలకు హాజరైన సమయంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆమె మొదటి కొన్ని ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, 2004లో మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో డీకే అరుణ సమాజ్వాదీ పార్టీ తరపున గెలిచి , ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆమె చారిత్రాత్మకమైన విద్యుత్ ఆందోళనలో పాల్గొని, మహబూబ్నగర్ జిల్లా రైతుల సాగునీటి సమస్యలను ఎత్తిచూపడానికి గద్వాల్ నుండి రాష్ట్ర రాజధానికి పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఎండిపోయిన నీటి కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారు. సెప్టెంబరు 2016లో గద్వాల్ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆమె గద్వాల్ మండలంలోని జములమ్మ దేవాలయం నుండి అలంపూర్లోని జోగులాంబ దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత రెండు రోజుల నిరాహార దీక్ష చేశారు.
2018లో అరుణ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గద్వాల్ నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆమె మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ అంతిమ విజయం న్యాయస్థానం ద్వారా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది.
వాస్తవానికి గద్వాల ఎమ్మెల్యేగా మళ్లీ డీకే అరుణ గెలిచిందని చెప్పవచ్చు.
మార్చి 2019లో, ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2019 లోక్సభ ఎన్నికల్లో కేసిఆర్ గాలి వీచే సమయంలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 77,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సెప్టెంబర్ 2020లో, ఆమె భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల డీకే అరుణ ఈ పార్లమెంటు ఎన్నికల్లో చక్రం తిప్పబోతున్నారనేది రాజకీయ విశ్లేషకులు అంచనా. జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్
