దిల్లీ దేశంలో లోక్సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు అధికార పార్టీకి కోర్టు సుధీర్ఘ గడువు ఇచ్చింది. జూన్ 15లోగా పార్టీ తమ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది. పార్టీ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని కోర్టు పేర్కొంది.
