హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
ఎన్నో విశేషాలు, విషాదాలతో 2025వ సంవత్సరం నేటితో వెళ్ళిపోతుంది.. ఇక రేపటినుండి మరో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా..
2025 వ సంవత్సరంలో తెలంగాణలో ప్రధానమైన సంఘటనలు.. ఓసారి గుర్తుచేసుకుందాం..
తెలంగాణ.. కీలక రాజకీయ సంఘటనలు..
కుల గణన మరియు రిజర్వేషన్*: తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగతులు 56.33% ఉన్నారని వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించింది. దీని ఆధారంగానే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం బిల్లులను ఆమోదించింది
మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ కి స్థానం దక్కింది..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక*: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, BRS అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ విజయం సాధించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు*: గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 53.60% సీట్లు సాధించింది, 12,727 స్థానాలకు గాను 6,822 స్థానాలను గెలుచుకుంది
కెసిఆర్ రాజకీయాలలోకి పునరాగమనం..మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు.
కల్వకుంట్ల కవిత ఎపిసోడ్..2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు మాజీ బిఆర్ఎస్ నాయకురాలు కె.కవిత ప్రకటించారు.
డ్రగ్స్ సీజ్డ్..హైదరాబాద్ పోలీసులు 2025లో 6,000 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు
మిస్ వరల్డ్ 2025:* మే నెలలో హైదరాబాద్లోని HITEXలో 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా జరిగాయి.
బతుకమ్మ రికార్డు..
సెప్టెంబర్ నెలలో సరూర్నగర్ స్టేడియంలో 63 అడుగుల భారీ పూల బతుకమ్మను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంనవంబర్ 3న రంగారెడ్డి జిల్లా *చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం* జరిగింది. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది, బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. టిప్పర్ లో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు.
పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
సంఘటన..సిగాచి పేలుడు*జూన్ 30న సంభవించిన అత్యంత విషాద సంఘటన పటాన్చెరు ప్రాంతంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు లో 54 మంది దుర్మరణం చెందడం జరిగింది
ఎస్ఎల్బీసీ ప్రమాదం
ఫిబ్రవరి 22న తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) ప్రాజెక్టు పరిధిలో సొరంగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మెస్సి ఫుట్బాల్
ప్రపంచ ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి హైదరాబాద్ పర్యటనలో సందడి చేశారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అతనితో ఫుట్బాల్ ఆడి అందరిని ఆకట్టుకున్నారు..
సైబర్ క్రైమ్స్సైబర్ క్రైమ్ కేసులు8% తగ్గాయి, అయితే జాతీయ జాబితాలో తెలంగాణ ఇప్పటికి అగ్రస్థానంలో ఉంది, డిజిటల్ మోసం కారణంగా రూ.251 కోట్లు కోల్పోయింది.
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్:
తెలంగాణ ఆర్థిక బలం మరియు పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రదర్శించే సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
వీటితోపాటు..మహిళలు మరియు పిల్లలపై నేరాలు*
మహిళలకు సంబంధించిన కేసులు 6% పెరిగాయి, 2024లో 2,482 కేసులతో పోలిస్తే 2025లో 2,625 కేసులు నమోదయ్యాయి.
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద పిల్లలపై నేరాలు 27% పెరిగాయి, 2068 కేసులు 2068 ఉన్నాయి
– *ఆస్తి నేరాలు*: ఆస్తి రికవరీ రేటు 24% పెరిగింది
*సంక్షేమ పథకాలు మరియు ప్రాజెక్టులు*
*రాజీవ్ యువ వికాసం 2025:* నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ₹3 లక్షల నుండి ₹4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా ₹6,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
*యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్:* ₹11,600 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 58 సమీకృత నివాస పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
*హైదరాబాద్ మౌలిక సదుపాయాలు:* పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు ₹125 కోట్లు కేటాయించి పనులను వేగవంతం చేశారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం 734 ఎకరాల భూమిని కేటాయించారు.___________________
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..
2025 లో రాష్ట్రం లో వివిధ సంఘటనలు జరిగినవి.. అందులో ప్రధానమైనవి..
జిల్లాల పునర్వ్యవస్థీకరణ*
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తోంది, డిసెంబర్ 31, 2025న తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లను సృష్టించడం వంటి మార్పుల్లో ఉన్నాయి.
TDP మహానాడు*:
పార్టీ వ్యూహం మరియు రాయలసీమ అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించిన తెలుగుదేశం పార్టీ (TDP) కడపలో తన మహానాడును నిర్వహించింది.
ఈ గవర్నెన్స్..
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక క్రమశిక్షణ మరియు పారదర్శకతను నొక్కి చెప్పారు. 800కు పైగా సేవలు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి, వీటిని 1,200కి విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సంకీర్ణ రాజకీయాలు*:
జనసేన పార్టీ (JSP) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) తో TDP నేతృత్వంలోని కూటమి స్థిరత్వాన్ని కొనసాగించింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సంయమనం పాటించారు.
తిరుమల ఆలయ వివాదం*: తిరుమల ఆలయంలో అవినీతి మరియు నిర్వహణలో లోపాలు టీడీపీ మరియు వైఎస్సార్సీపీ మధ్య తీవ్రమైన రాజకీయ చర్చలకు దారితీశాయి.
ఆర్థిక వృద్ధి*:
ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమించి Q1లో 12.02% మరియు Q2లో 11.28% వృద్ధి రేటును నమోదు చేసింది.
సైబర్ క్రైమ్*:
‘సిమ్ బాక్స్ టెక్నాలజీ’ని ఉపయోగించి భారీ అంతర్జాతీయ సైబర్ఫ్రాడ్ నెట్వర్క్ ఛేదించబడింది మరియు అవయవ మార్పిడి రాకెట్లో పాల్గొన్నందుకు బెంగళూరు వైద్యుడిని అరెస్టు చేశారు.
పరకామణి దొంగతనం*:
తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి పరకామణి నుండి $900 చోరీకి సంబంధించిన సంచలన కేసు విచారణలో ఉంది
కర్నూలు బస్సు ప్రమాదం:
ఈ ఏడాది కర్నూలు వద్ద జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకర సంఘటనగా నిలిచింది.
మొత్తం 2025లో జరిగిన ఘోర ప్రమాదాలు..
తిరుమలలో తొక్కిసలాట
2025లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మూడు ప్రధాన ఆలయాల్లో దుర్ఘటనలు జరిగాయి. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట సందర్భంగా సుమారు ఆరుగురు భక్తులు మరణించగా మరో 40 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఏప్రిల్ నెలలో విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో వర్షం కారణంగా గోడ కూలి ఏగుడురు భక్తులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.
అలాగే నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన.. మెట్ల రైలింగ్ కూలడం ద్వారా సుమారు 9 మంది భక్తులు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.
ఈ ప్రమాదాలు ఆలయాల్లో భక్తుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీశాయి.
తుఫాన్..
మానవ తప్పిదాలే కాకుండా ప్రకృతి విపత్తుల కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదాలు సంభవించాయి. గత అక్టోబర్ నెలలో ‘మోంథా’ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లక్షల మంది ప్రభావితులు అయ్యారు. అయితే ఈ విపత్త కారణంగా కొందరు మరణించినప్పటికీ.. మరణాల సంఖ్య అధికారికంగా వెలువడలేదు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
