హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్కు వెళ్లారు. నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్లోని థింపులో పర్యటించనున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొననున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాజా వివరాలు అడిగి తెలుసుకుని భూటాన్కు బయల్దేరి వెళ్లారు.
—————
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు
