బెంగళూరు, 24 డిసెంబర్ (హిం.స)
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీ ధర రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇక భోజనం చేయడానికి 500 నుండి 1,000 రూపాయలు చెల్లించక తప్పదంటూ ఏడుస్తున్న జనాలకు ఇప్పుడు తీపి కబురు అందుతోంది. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పేదల హోటల్గా పిలుచుకునే ఇందిరా క్యాంటీన్ను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రేపు సోమవారం అధికారివర్గం టీం సమావేశకానున్నది.
బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం రూ.5కే స్నాక్స్, రూ.10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని, వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్లోని లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. ఇప్పుడు రాగి ముద్ద, మంగళూరు బన్స్తో సహా వివిధ భోజనాలు వడ్డిస్తున్నారు.
ఇప్పుడు మరో ప్రభుత్వ ఇందిరా క్యాంటీన్ ఖరీదైన ఫుడ్ అవుట్లెట్లలో కూడా భోజనం ప్రారంభించాలని యోచిస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే, సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులతో సహా రాష్ట్రం, విదేశాలకు చెందిన ప్రజలకు గమ్యస్థానంగా బెంగళూరులోని నాడప్రభు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయంలో ఒక్కో ఆహార పదార్థానికి వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.. అందుకే రూ. 5 అల్పాహారం, రూ. 10మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
త్వరలో బెంగళూరు విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలియజేసారు. తగ్గింపు ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో గుర్తించబడిన ప్రదేశంలో 2 కొత్త ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
